Friday, February 24, 2012

కాపులకు కావాల్సింది రిజర్వేషన్లా ?? బి.సి లలో చేర్చడమా ???


సమైక్యరాష్ట్ర ముసుగులో కాపుల ఉసురు తీసిన అగ్రవర్ణాలు

2G spectrum కేసు పెద్దదా ?? కాపులపై జరిగిన ఆర్ధిక సామాజిక కుట్ర పెద్దదా ??

అధికారానికి బాట



బీసీలకు పెద్దపీట అధికారానికి బాట

February 22, 2012
రాష్ర్టంలో రాజకీయ అనిశ్చితి చోటుచేసు కుందా? అనేది చర్చనీయాంశమయింది. కాంగ్రెస్‌ పార్టీ తన స్వంత బలంమీద 2009లో పాల నాధికారాన్ని చేపట్టినా, సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవశాత్తూ మర ణించిన అనంతరం, ఆయన కుమారుడు వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి పదవి కూడా వారసత్వంగా తనకే దక్కాలనీ దృఢంగా ఆకాక్షిం చారు. అప్పటి ప్రభుత్వ సలహాదా రు, దివంగత ముఖ్యమంత్రికి ఆత్మబంధువుగా గుర్తింపు పొందిన కె.వి.పి. రామచంద్రరావు జగన్‌ ఆకాంక్షకు సహకరించి, అందుకు సుమారు 140 మంది శాసనసభ్యుల సంతకాలు సేకరించారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ బహిరంగంగా జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వ్యతిరేకించని దశలో, రాష్ర్టప్రజలు కూడా జగన్‌ ముఖ్యమంత్రి అవుతారేమో అనే ఆలోచనలో పడ్డారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోశయ్య వయస్సు, జగన్‌ వర్గం కల్పిస్తున్న పాలనా అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, తదితర సమస్యలతో సతమతమై, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తనను బాద్యతలనుంచి తప్పించమని కోరగా, అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. కిరణ్‌ కూడా రెడ్డి సామాజికవర్గానికి జెందిన రాయలసీమవాసి, కిరణ్‌ తండ్రి నల్లారి అమర్‌నాథరెడ్డి నెహ్రూ, ఇందిర కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు కావడం, అలాగే జగన్‌కు చెక్‌ పెట్టగల సమర్థుడని అధిష్ఠానం భావించింది. ముఖ్యమంత్రిగా బొత్స సత్యనారాయణను సీఎంగా చేసి ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అటు బీసీలనుండి, ఇటు కాపులనుండి మద్దతు లభించి ఉండేది. బహుశా స్వాతంత్యం వచ్చినప్పటి నుండి చాలా కాలం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ర్ట నాయకత్వాన్ని ఇతర సామాజిక వర్గ చేతుల్లోకి మార్చదలచుకొనలేదనేది స్పష్టమైంది.

ఇంతవరకు ఒక్క బీసీ నాయకుడు కూడా రాష్ర్ట ముఖ్యమంత్రిగా పదవిని పొందలేదు కాబట్టి, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయితే అనేక బీసీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ర్టంలోని బీసీలు ఆశగా ఎదురు చూశారు. అంతేగాక కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు బీసీలకు అన్ని రంగాలలో కూడ మొండిచెయ్యేనని భావించారు. ఫీజు రియింబర్సుమెంటుకు నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, రియింబర్స్‌మెంట్‌కు అర్హతగా ఎస్సీ, ఎస్టీలకు ఆదాయ పరిమితిని రూ. 2 లక్షలుగా పెంచి, బీసీలకు మాత్రం లక్ష రూపాయలు గానే కొనసాగించడం వారిలో ఈ అనుమానాల్ని పెంచాయి. రాష్ర్ట బీసీ కమిషన్‌ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉద్యోగ, విద్యారంగాలలోనున్న రిజర్వేషన్ల శాతాన్ని 25 శాతం నుంచి 48 శాతం వరకు వరకు పెంచవచ్చునని ప్రకటించి, రాష్ర్టవ్యాప్తంగా బహిరంగ విచారణలు చేపట్టింది. బీసీ రిజర్వేషన్లను పెంచేదిశగా నివేదిక సమర్పించేందుకు కమిషన్‌ మూడు నెలలు వ్యవధి కోరినా ఆ అభ్యర్థనను ప్రభుత్వం బుట్టదాఖలా చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి ప్రతిపాదనకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 10.55 శాతం తగ్గించి, 23.45 శాతం చేశారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం లోపు కుదించాలని రెడ్డి త్రయం- రమాకాంత్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి- ప్రయత్నించారు.

బీసీల రిజర్వేషన్లను తగ్గించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనీ, రాష్ర్టంలో బీసీల అధికారిక గణాంకాలుంటే, తదనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లకంటే మించి ఇవ్వవచ్చుననీ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందనే వాస్తవాన్ని మిగతా బీసీ మంత్రులను కూడా కలుపుకొని గట్టిగా వాదించినందున 60.55 శాతం రిజర్వేషన్లతోనే జీఓ విడుదలైంది. సర్పంచుల సంఘానికి చెందిన రెడ్డి సామాజిక వర్గపు అధ్యక్షునితో రాష్ర్ట హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేయించారు. జస్టిస్‌ రోహిణి 60.55 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించమని తీర్పు నిచ్చినా- ఎన్నికలకు రాజకీయంగా సానుకూలత లేనందున, అందుకు వ్యతిరేకంగా మరో రిట్‌ పిటిషన్‌ను డివిజన్‌ బెంచిలో దాఖలు చేయించి ‘స్టే’ పొందారు.
ఈ చర్యలను గమనించిన బీసీలు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిని బీసీ వ్యతిరేకిగా భావించారు. ఏసీబీ రాష్ర్టవ్యాప్తంగా మద్యం మాఫియా మీద, ఎక్సైజ్‌ అధికారుల మీద దాడులు జరిపి అరెస్టులు కావించింది.

బొత్స సత్యనారాయణ మద్యం మాఫియా అనే ప్రచారం ముందుకు వచ్చింది. బీసీ సామాజిక వర్గ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరును అరెస్టు మెమోలో చేర్చి, కోర్టుకు సమర్పించటంతో, రాష్ర్ట వ్యాప్తంగా బడుగులు భగ్గుమనడంతో మోపిదేవి రాజీనామాను కోరే అవకాశం లేకపోయింది!
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ శాసన సభ్యుడయిన దామోదర్‌రెడ్డి బాహాటంగా, రాష్ర్ట ముఖ్యమంత్రి సీమాంధ్రకు సంబంధించిన వారు కాబట్టి, పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణ వారికివ్వాలనే వాదనను బలంగా ముందుకు తెచ్చారు. ఈ డిమాండ్‌కు పునాదిగా, బొత్సకు జోడు పదవులున్నాయనే అంశాన్ని తెరమీదకు తేవడం జరుగుతోంది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన బీసీలు 1952 నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జాతీయ పార్టీ నుండి ఇంతవరకూ బీసీ సామాజిక వర్గం నుండి ఒక్క ముఖ్యమంత్రినీ నియమించలేదనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడైనా అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవిని బీసీల కిచ్చి, పీసీసీ పదవిని తెలంగాణ ప్రాంత రెడ్డి సామాజిక వర్గానికిస్తే, 2014 ఎన్నికలలో రాష్ర్టంలో 50 శాతంతో అతిపెద్ద వర్గమైన బీసీలు, 12 శాతం ఉన్న కాపులు కలసి మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గెలుపించుకొని, బీసీ ముఖ్యమంత్రినే 2019 వరకూ కొనసాగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించగలగుతామని కాంగ్రెస్‌పార్టీలోని బీసీలు, కాపులు బాహాటంగానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను నియంత్రించి, పార్టీ కార్యకర్తలను ఒక తాటిమీదికి తెచ్చి, ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిలో గ్రూపు రాజకీయాలకు ముందుకు వచ్చి, వర్గ భేదాలను బహిర్గతం కావడంతో, కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికలలోనే కాదు, 2014లో కూడ విజయం సాధించడం అసాధ్యమయ్యే అవకాశాలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలోని రాజకీయ కుమ్ములాటలను తనకు అనుకూలంగా తెలుగుదేశం మలచుకొంటుందా, లేక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మలచుకొంటుందా అనే విషయం ఉప ఎన్నికలలోనే బయట పడబోతోంది. అందువల్ల ఇప్పటికైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం కళ్ళుతెరచి, బీసీలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని, ఆకాంక్షలను గమనించి బీసీలకు పాలనా పగ్గాలు అప్పగించి రాష్ర్టంలో తన పార్టీ అధికారాన్ని కాపాడుకొంటుందా అనే విషయాన్ని వేచిచూడాలి!


source:surya paper 22.02.12

కాంగ్రెస్‌ ‘కాపురం’ కమ్మారెడ్డి గరం

కాంగ్రెస్‌లో ‘కుల’ కులం రేగింది. కమ్మ-రెడ్డి వర్గాలు కలసి కాపులపై యుద్దం ప్రకటించాయి. కాపులు సైతం దానిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలి కాలంలో కాపు వర్గానికి పెరుగుతున్న ప్రాధాన్యతను అడ్డుకునేందుకు ఆ రెండు వర్గాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఫలితంగా కాంగ్రెస్‌లో కుల సమీకరణ లు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిరంజీవి రంగప్రవేశంతో కాంగ్రెస్‌లో మొన్నటి వరకూ పెద్దగా గుర్తింపు లేని కాపులకు ఎక్కడ లేని ప్రాధాన్యం లభిస్తోం ది. ఆయన సిఫారసు చేసిన ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు.

చిరంజీవిని అత్యంత కీలకమైన సమన్వయ కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు. అదే సమయంలో సాంకేతికంగా బీసీలయినప్పటికీ, మానసికంగా తామూ కాపులుగా చెలామణి అవుతున్న తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గానికి చెందిన డి.శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ కూడా సమన్వయ కమిటీలో ఉండటంతో కాపులుగా భావిస్తున్న వారి సంఖ్య మూడుకు చేరినట్టయింది. పార్టీలో తమ కులాలకు ప్రాధాన్యం తగ్గించడాన్ని రెడ్డి-కమ్మ సామాజికవర్గం సహించలే పోతోంది. దశాబ్దాల పాటు పార్టీపై ప్రత్యక్ష పెత్తనం సాగించి, ముఖ్యమంత్రి పదవులను వరసగా సాధించిన రెడ్డి సామాజికవర్గం తాజా పరిణామాలతో కుతకు తలాడుతోంది. తాజాగా కమ్మ వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీలో సీనియర్లకు ప్రధానంగా కమ్మ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జగన్‌ ప్రజాదరణ ఉన్న నాయకుడు. కమ్మవారిని టాయిలెట్‌ పేపర్‌లా వాడుకుని వదిలేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారు.

వారికి ప్రాధాన్యం ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని ’ వ్యాఖ్యానించారు. నిజానికి రాయపాటి చాలాకాలం నుంచీ అసంతృప్తితోనే ఉన్నారు. తాను సీనియర్‌ అయినప్పటికీ, పార్టీ తనకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఉడికిపోతున్నారు. దానికితోడు తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లోని కాపు వర్గంలో పలుకుబడి, పట్టు ఉన్న కన్నాకు గుర్తింపు ఇవ్వడం రాయపాటికి సుతరామూ న చ్చడం లేదు.

అందుకే ఆయన అనేకసార్లు కన్నాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా తన పార్లమెంటు పరిథిలోని పత్తిపాడుతో పాటు, జిల్లాలోని మాచర్ల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కన్నాపైనే ఉందని నేర్పుగా బంతిని ఆయన వైపు నెట్టేశారు. నిజానికి, తన ఎంపీ నియోజకవర్గ పరిథిలోని పత్తిపాడులో కన్నా జోక్యం చేసుకుంటున్నారని గతంలో కిరణ్‌, బొత్సకు రాయపాటి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌, మంత్రి డొక్కా ఫిర్యాదు చేశారు. దానితో జోక్యం చేసుకోవద్దని వారిద్దరూ కన్నాకు సూచించారు. అదేసమయంలో పత్తిపాడు సీఐను కూడా మార్చి, రాయపాటి తను కోరుకున్న వ్యక్తిని తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కన్నా పత్తిపాడుపై దృష్టి సారించడం మానేశారు. అయితే కమ్మ వర్గం 50 వేలు, కాపులు 35 వేల మంది రెడ్లు 17 వేల మంది ఉన్న అక్కడి ఓటర్లలో.. గెలుపును నిర్దేశించే కాపులు తనకు సహకరించరన్న ముందు జాగ్రత్తతోనే, రాయపాటి అక్కడి అభ్యర్ధి విజయం కన్నాపైనే ఉందని లౌక్యంగా ప్రకటించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ కన్నా మాత్రం.. తనను జోక్యం చేసుకోవద్దని ఫిర్యాదు చేసిన రాయపాటి అక్కడ అభ్యర్ధి ఎంపిక, గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని పార్టీకి స్పష్టం చేసినట్లు సమాచారం.

అదీగాక.. తాజాగా నర్సరావుపేటలో జరిగిన కమ్మసభలో తామంతా కలసి ఉండాలని చంద్రబాబును కోరానని బహిరంగంగానే చెప్పారు. అసలు రాయపాటి ఎప్పుడూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఎంపీ నిధులు ఇవ్వరని, కమ్మ వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలకే ఇస్తారని కన్నా వర్గం మొదటి నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగా గుంటూరు జిల్లాలో కమ్మ-కాపు మధ్య పోరు జరుగుతోంది. అటు మరో సీనియర్‌ ఎంపీ కావూరి సాంబశివరావు కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. తనకంటే జూనియర్‌ అయిన పురంధీశ్వరికి కేంద్రంలో చోటివ్వడాన్ని ఆయన తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా కాపు కోటా నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కావూరిని ఆగ్రహంతో రగిలిస్తున్నాయి.

మొదటి నుంచీ పార్టీ జెండాను మోస్తున్న తమను కాదని, మధ్యలో వచ్చిన కొత్తవారిని అందలం ఎక్కించడం ఆయనకు నచ్చడం లేదు. రాయపాటి, కావూరి ఇద్దరూ అనేక సందర్భాల్లో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ బాహాటంగానే ఆక్రోశం వెళ్లగక్కారు. చిరంజీవికి కేంద్రమంత్రి పదవితో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం పీఆర్పీకే మంత్రివర్గంలో చోటు కల్పించే యత్నంపై వారిద్దరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా నాయకత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు.

‘కృష్ణా జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కమ్మ సామాజికవర్గం పార్టీని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంది. అయినా మాపై నిర్లక్ష్యం. ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారంటున్నారు. ఏం చేయాలి? పదవులు అడుక్కోవాలా? మేం ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వెళ్లాల’ని పాలడుగు నిలదీసినంత పనిచేశారు. చిరంజీవి వ ర్గీయులకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే సీనియర్లను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వీరంతా కాపు వర్గానికి పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక కోస్తా కాంగ్రెస్‌లో సరిపడని కమ్మ-రెడ్లు తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి పార్టీని శాసించిన రెడ్డి వర్గానికి చిరంజీవి రాకతో గొంతులో వెలక్కాయపడినట్టయింది. వరసగా ముఖ్యమంత్రి పదవులను చేజిక్కించుకుంటున్న రెడ్లకు.. ఇటీవలి కాలంలో కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం రుచించడం లేదు.

జగన్మోహన్‌రెడ్డి వైపు రెడ్లు వెళుతున్నందున ఇక రెడ్లకు ప్రాధాన్యం తగ్గించాలని నాయకత్వం నిర్ణయించడంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ సాకుతో తమను అణచివేసి, కాపులను అందలం ఎక్కించే పథకాన్ని అడ్డుకునేందుకు రెడ్డి వర్గీయులు రంగంలోకి దిగారు. రెడ్లను పక్కకుపెడితే పార్టీ ఇంకా నష్టపోతుందని నాయకత్వంపై ఒత్తిడి చేసే పనిలో ఉన్నారు.అదే సమయంలో తమ ఒకరి పోరాటంతోనే ఇది సాధ్యం కాదని గ్రహించిన రెడ్డి వర్గం, కమ్మ వర్గాన్ని సమన్వయం చేసుకుని కాపులపై యుద్ధానికి నడుంబిగిస్తోంది. తాజాగా సీనియర్‌ నేత, వివాదరహితుడిగా పేరున్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రెడ్లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్మోహన్‌రెడ్డికి జనబలం ఉందని, ఆయనకు జనబలం లేదని తానెప్పుడూ అనలేదని వ్యాఖ్యానించారు. ‘జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఆయన సభలకు జనం వస్తున్నారు. సీనియర్ల సేవలు అవసరం లేదని నాయకత్వం భావిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయను. రాజకీయాల్లో కులభావన పెరుగుతోంది. క్యాబినెట్‌లో తెలంగాణకు దామాషా ప్రకారం మరికొన్ని పదవులు ఇవ్వవలసి ఉంది’ అని గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాపులకు నాయకత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యంపై అసంతృప్తి స్పష్టమవుతోంది.
దానికితోడు.. కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే రెడ్లు మొత్తం జగన్‌కు జై కొడతారన్న హెచ్చరిక కూడా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అయితే, గాదె చేసిన వ్యాఖ్యలను రాయపాటి స్వాగతించి, మద్దతు తెలపడం చూస్తే ఆ రెండు సామాజికవర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి కాపులపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అటు కాపు వర్గం కూడా రెడ్డి-కమ్మ వర్గంపై కత్తులు నూరుతోంది. కాంగ్రెస్‌ పార్టీని దశాబ్దాల నుంచి శాసిస్తోన్న రెడ్లు, జనాభా సంఖ్య తక్కువయినా.. అంతకుమించి గౌరవం పొందుతున్న కమ్మ వర్గం ఇంకా పెత్తనం చేయాలని భావించడం సరికాదని కాపు నేతలు వాదిస్తున్నారు. 10 శాతం జనాభా ఉన్న తమను కాంగ్రెస్‌ నాయకత్వం దశాబ్దాల నుంచి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, తమను నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేస్తున్నారు.

అయినప్పటికీ, తాము మౌనంగా ఉన్నామని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చినప్పుడు రెడ్డి-కమ్మ వర్గీయులు అడ్డుపడటంపై కాపు వర్గం మండిపడుతోంది. చిరంజీవి వచ్చిన తర్వాత తమకు ప్రాధాన్యం పెరిగితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ వైపు రెడ్లు వెళుతున్నందున ఇంకా ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం అవివేకమని, ఇప్పుడు రెడ్డి వర్గానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నికల సమయంలో వారంతా జగన్‌ వైపు వెళతారని స్పష్టం చేస్తున్నారు. కమ్మ వర్గం కూడా టీడీపీ వైపు వెళుతుందని, ఆ క్రమంలో ఒక్క కాపులు మాత్రమే పార్టీకి దన్నుగా నిలుస్తారని విశ్లేషిస్తున్నారు. అందువల్ల కాపులకు అవకాశాలు ఇవ్వడంలో తప్పేమీ లేదంటున్నారు.

అంతకు ముందు.. కాపులకు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరుగుతోందని, ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాపులను అణచివేస్తూ సొంత వర్గానికి పెద్ద పీట వేస్తు న్నారని కాపునాడు రాష్ట్ర నేత మిరియాల వెంకట్రావు బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా కన్నా, వ ట్టి వంటి వారికి అప్రాధాన్య శాఖలు ఇచ్చారని, బొత్స ఎదుగుదలను సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిరి యాల నేరుగా రెడ్లపైనే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం స్పష్టమవుతోంది.

తమకు రాక రాక వచ్చిన అవకాశాన్ని రెడ్డి-కమ్మ నేతలు ఒక పథకం ప్రకారం అడ్డుకోవడంతో దాన్ని తిప్పికొట్టాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు. దానికి కాపు సంఘాలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ విషయంలో తాము ఎంతవరకయినా వెళ్లాలని తీర్మానించుకున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలోని రెడ్డి-కమ్మ వర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని.. నాయకత్వాన్ని చేజిక్కించుకుని, కాంగ్రెస్‌లో పైచేయి సాధించాలని నిర్ణయించుకున్నట్లు వారి మాటల ధోరణి స్పష్టమవుతోంది.

రాష్ట్రములో కుల ప్రాబల్యం

1980 దశకంలో రంగా హత్య తర్వాత కాపులు రాజకీయంగా సంఘటితం అయ్యే క్రమం పుంజుకుంది. ఒక వైపు తమ కులం ప్రాబల్యం గల, అంతకంటే మించి తమ నాయకత్వంలో గల- రాజకీయ పార్టీ కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. పైగా ఈ కుల సంఘటన తెలుగుదేశం వ్యతిరేకతను కూడా సంతరించుకుంది. కాపుల ప్రాబల్యం గల పార్టీ ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. దాసరి నారాయణరావు కొంత ఊగినా, కాంగ్రెస్‌పార్టీ ఆయనను తన కౌగిలిలోకి తెచ్చుకుంది. జనాకర్షణ గల నాయక త్వం లభించకపోవడంతో అలాంటి పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చల్లారిపోయాయి. తెలుగు దేశం పార్టీపట్ల వ్యతిరేకతతో వారు ప్రధానంగా కాంగ్రెస్‌కు సమర్ధకులుగా మిగిలిపో యారు. కాని కాపుల ప్రాబల్యంగల పార్టీ ఏర్పడాలన్న కాంక్ష కొనసాగుతూనే ఉంది.

మరొక వైపు బహుజనులను సంఘటితం చేయడానికి వారి నాయకత్వంలో రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా 1990 దశకంలో ముమ్మరంగా సాగాయి. ఉత్తరప్రదేశ్‌ అనుభవంతో కాన్షిరాం ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని పొందాలని గట్టి ప్రయత్నాలు చేశారు. 1994 ఎన్నికలలో రాష్టవ్య్రాపితంగా పోటీ చేసి పెద్దఎత్తున ప్రచారాన్ని సాగించారు. కాని ఉత్తరప్రదేశ్‌ ఫలితాలను ఇక్కడ సాధించలేకపోయారు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి. కులాలను ఒక తాటిపైకి తేగల జనాకర్షణ గల నాయకత్వం ఈ కులాలకి లభించలేదు.

అంతకంటే మించిన రాజకీయ కారణాలు బలీయంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బి.సి. లు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, ఎస్‌.సి, లు ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉన్నాయి. రాజకీయంగా చిరకాలంగా ఇవి పరస్పర వైరి పక్షాల మధ్య చీలిపోయి వున్నాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ రాజకీయ సంఘర్షణ వారిలో ఐక్యతకు తీవ్రమైన అవరోధం అయింది.

ఈ పరిణామం తర్వాత బహుజనుల ప్రాబల్యం గల పార్టీ ఏర్పాటు తెరమరుగైంది. కాని గణనీయమైన సంఖ్యలో ఉన్న బి.సి.లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థలు వారి రాజ్యాధికారం పొందాలన్న కాంక్షను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలకి ముందు ఒకవైపు కాపుల పార్టీ ఏర్పాటు మీద, మరోవైపు బి.సి.ల పార్టీ ఏర్పాటు మీద తర్జనభర్జనలు చేయడం పరిపాటి అయింది. కాని దీనికి ఒకరూపం ఇవ్వగల నాయకత్వం లభించకపోవడం- ఆయా ప్రధానపార్టీలలోఉన్న నాయకత్వం ఈ రగడ ద్వారా మరికొన్ని సీట్లు సాధించుకుని సర్దుకుపోవడం సాగిపో తున్నది.

ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల ముందు అటు కాపులలో, ఇటు బి.సి.లలో స్వంత పార్టీల మీద మల్లగుల్లాలు ప్రారంభం అయ్యాయి. కాపు కులానికి చెందిన చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. కాపుల గొడుగు కింద ఉన్న కులాల అండకు తోడుగా చిరంజీవికి గల జనాకర్షణ తోడైతే దానికి బి.సి.ల సామా జిక న్యాయాన్ని జతచేస్తే అదొక ప్రబల రాజకీయ శక్తిగా మారి ఎన్నికల్లో విజయాలను సాధిస్తుందని వారు భావించారు.

ఇలా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం జరిగిపోయింది. 1982లో ఎస్‌.టి. రామారావు లాగా చిరంజీవి కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టిం చగలుగుతారని ఆయన 9 నెలలలో అధికారంలోకి వస్తే చిరంజీవి 7, 8 నెలలలోనే అధికారాన్ని సొంతం చేసుకుంటాడని ఈ పార్టీ ఏర్పాటును ప్రోత్సహించిన వారు, దానికి సిద్ధపడిన వారు భావించారు. అయితే ఎన్‌.టి.ఆర్‌. కాలంనాటి రాజకీయ శూన్యతను- అలాగే తెలుగుదేశం పార్టీ కుల ప్రాబల్యం కలిగినప్పటికీ ప్రధాన స్రవంతి పార్టీగా రూపుదిద్దుకున్న తీరును వారు పరిగణనలోకి తీసుకోలేదు.

చిరంజీవి రాజకీయ ప్రవేశం సమయానికి- ఎన్‌.టి.ఆర్‌ ప్రవేశం నాడు ఉన్న రాజకీయ శూన్యత లేదు. అనాడు కాంగ్రెస్‌ పార్టీ ఏకచ్ఛత్రాధిప్రత్యానికి ప్రత్యామ్నాయం లేదు. ఎన్‌.టి.ఆర్‌. అలాంటి ప్రత్యామ్నాయాన్ని అందించారు. ఆనాటి రాజకీయ శూన్యతని ఆక్రమించారు. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఒక దానికొకటి ప్రత్నామ్నాయంగా దీటైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏక పార్టీ గుత్తాధిపత్యమూ లేదు. సంప్రదాయ రాజకీయ సంఘర్షణలో శూన్యత కూడా లేదు. ఇలాంటి సందర్భంలో చిరంజీవి రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఎన్‌.టి.ఆర్‌. కాలానికి భిన్నమైన రాజకీయ నేపథ్యంలో చిరంజీవి రాజకీయం మొదలు పెట్టారు. ఈ పరిస్థితులలో చిరంజీవి ముందు రెండు మార్గాలున్నాయి.

మొదటిది, సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ఒక నూతన ప్రత్యామ్నాయాన్ని సాధించగల పార్టీగా అవతరించడం! అంటే కొత్త తరహా రాజకీయం ఆధారంగా కొత్త రాజకీయ శక్తులను రంగంలోని తెచ్చి సంప్రదాయ పార్టీలను ఢీకొనడం. నూతన రాజకీయ సంస్కృతి పునాదిగా ఒక ప్రధాన స్రవంతి పార్టీగా ఆవిర్భవించడం. దీనికి సిద్ధాంత బలం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు పరిష్కారాలు కావాలి. సంప్రదాయ రాజకీయ పక్షాలను సంప్రదాయ పద్ధతులతోనే ఢీ కొనడం.కాని ఆయన ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రధాన స్రవంతి పార్టీలుగా ఉంటూనే కుల ప్రాబల్యం కొనసాగిస్తున్నాయి. అందువల్ల వాటికి కులముద్ర ఉన్నా అవి కులాలకి అతీతంగా ఓటు బ్యాంకులు గల పార్టీలుగా కొనసాగుతున్నాయి. వీటిని ఢీ కొనడానికి చిరంజీవి పెట్టిన పార్టీ- ఆదిలోనే కుల ముద్రతో ప్రారంభమైంది. చిరంజీవి జనాకర్షణతో అది ప్రధాన స్రవంతిగల పార్టీ అవుతుందని భావించారు. అలాగే కులం వెలుపల దానికి ఎలాంటి ఓటు బ్యాంకులు ఏర్పడ లేదు.


http://www.suryaa.com/archives/Article.asp?cat=1&subCat=7&ContentId=17825